మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. సార్ సినిమాలో “మాస్టారు మాస్టారు” అంటూ యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపేసిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందు భీమ్లా నాయక్, బింబిసార సినిమాలలోనూ నటించి మెప్పించింది. కాగా ఈ మూడు సినిమాలతో సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవల విరూపాక్ష అనే సినిమాలో నటించి ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది సంయుక్త.
అయితే ఈ హీరోయిన్ కి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మధ్య ఏదో ఉందంటూ గత కొద్దిరోజుల నుంచి పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమా దర్శకుడు సాగర్ అయినా.. సినిమా మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతులపైనే నడిచింది. ఇక సార్ సినిమాకి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సహ నిర్మాత.
అంతేకాకుండా గురూజీకి మదర్ బ్యానర్ లాంటి సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలోనే సంయుక్త కి ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ వచ్చేలా త్రివిక్రమ్ చేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం కాస్త మలయాళ ఇండస్ట్రీకి పాకింది. దీంతో అక్కడ సంయుక్త గురించి రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.
టాలీవుడ్ లో ఓ ముసలి దర్శకుడితో సంయుక్త హద్దులు దాటుతుందంటూ ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే సంయుక్త ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. ఇకనుండి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయకూడదని షాకింగ్ డెసిషన్ తీసుకుందట సంయుక్త.
తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేందుకు డిసైడ్ అయ్యిందట. ఇక ఇప్పటికే ఒప్పుకున్న త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా నుండి కూడా బయటకు వచ్చేసిందట. దీంతో సంయుక్త ఇప్పటికైన మంచి నిర్ణయం తీసుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News