తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఆడటం అనేది చాలా అరుదు. అందుకే ఫిలిం మేకర్స్ ఎవరు ఈ జానర్ లో సినిమా చేయడానికి పెద్ద ఆసక్తి కనబర్చారు. కానీ ప్రస్తుతం మారిన ట్రెండ్స్ దృష్ట్యా కరెక్ట్ వే లో థ్రిల్లర్ సినిమాలను ప్రజెంట్ చేస్తే జనాలు వాటిని కూడా చూస్తారని ప్రూవ్ చేసింది హిట్ ఫిలిం సిరీస్.
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ హిట్ సినిమా ఫ్రాంచైజ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ నటించగా, సెకండ్ సినిమాలో అడవి శేష్ కనిపించారు. న్యాచురల్ స్టార్ నాని హిట్ మూడవ పార్ట్ లో నటించనున్నారు. కాగా ఇప్పటికే మొదలవ్వాల్సి ఈ సినిమా షూటింగ్ నానికి ఉన్న వేరే ప్రాజెక్ట్ ల కమిట్మెంట్స్ మూలంగా ఈ సినిమా కాస్త లేట్ అయ్యేలా ఉంది. దాంతో డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ఈ హిట్ సినిమా ఫ్రాంచైజ్ కు బ్రేక్ ఇచ్చి, విక్టరీ వెంకటేష్ తో సైందవ్ అనే సినిమా చేస్తున్నాడు. శర వేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ తొందరగా ఫినిష్ చేసి, వచ్చే డిసెంబర్ కు సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఒక పక్క విక్టరీ వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తూనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను కూడా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు ఈ యంగ్ డైరెక్టర్ అని టాక్ వస్తుంది. నిజానికి అసలు విషయం ఏంటంటే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఇటీవల ఉపాసన డెలివరీ కారణంగా కొద్దీ రోజులు షూటింగ్ నుండి బ్రేక్ తీసుకోగా, రేపటి నుంచి మళ్ళీ గేమ్ చేంజర్ ను సినిమా షూటింగ్ ను ఆరంబించనున్నాడు చరణ్. అయితే డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ కూడా పూర్తి చేయవలసి ఉండగా, గేమ్ చెంజర్ లో ఉండే మెయిన్ ఎపిసోడ్స్ ను ఆయన మాత్రం డైరెక్ట్ చేసి, సినిమాలో మిగిలిన ప్యాచ్ వర్క్ ను డైరెక్టర్ శైలేష్ కొలను అప్పగించాడు. దాంతో ఈ విషయం బయటికి తెలిసి రామ్ చరణ్ తో శైలేష్ సినిమా చేస్తున్నడనే పుకారు బయటికి వస్తుంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News