Varun Tej : బడ్జెట్ సమస్యలతో ఆగిన “మట్కా”… నిజమేంటో బయట పెట్టిన వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, మట్కా అంటూ భారీ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అయితే ప్రస్తుతం “ఆపరేషన్ వాలెంటైన్” రిలీజ్ కు రెడీ అవుతుండగా, “మట్కా” మాత్రం బడ్జెట్ సమస్యలతో ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై తాజాగా వరుణ్ తేజ్ స్పందిస్తూ, అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “మట్కా”. ఆయన కెరీర్లో ఇది 14 సినిమా కాగా, పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. “మట్కా” మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. “మట్కా” మూవీ యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుందని ఇప్పటికే కరుణ కుమార్ వెల్లడించారు. విశాఖ నేపథ్యంలో 1958 నుంచి 1982 మధ్య కథ నడుస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ 4 గెటప్లలో కనిపించబోతున్నారు. ఇక వరుణ్ తేజ్ ఇప్పటిదాకా నటించిన సినిమాల్లో ఇదే హైయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. అయితే చాలా కాలం క్రితమే మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ తాజాగా బడ్జెట్ సమస్యల కారణంగా హోల్డ్ లో పడిందని టాక్ నడిచింది.

ఈ సినిమాకు బడ్జెట్ చేతులు దాటిపోయే అవకాశాలు ఉండడంతో పాటు, ఇలాంటి కథాంశాలతో రూపొందిన చిత్రాలకు ప్రస్తుతం మార్కెట్ బాగాలేదని కొంతకాలం సినిమాను పక్కన పెట్టాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్టు గుసగుసలు విన్పించాయి. వరుస డిజాస్టర్లు అందుకున్న వరుణ్ మార్కెట్ కూడా డీలా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే “మట్కా” డీల్స్, రికవరీలు పరిగణలోకి తీసుకుంటే ప్రాజెక్ట్ రిలీజ్ కి ముందే నష్టాలు చవి చూసే అవకాశం ఉండడంతో టీం మళ్లీ బడ్జెట్ ను తగ్గించే పనిలో పడిందనీ, ఈ మూవీ కోసం పారితోషకం తగ్గించుకోవాలని మేకర్స్ వరుణ్ తేజ్ ను రిక్వెస్ట్ చేయబోతున్నారని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతానికి ఫిబ్రవరి, మార్చ్ లో జరగాల్సిన షెడ్యూల్స్ “మట్కా” ప్రాజెక్ట్ హోల్డ్ లో పడడంతో క్యాన్సిల్ అయినట్టు రూమర్స్ విన్పించాయి. వీటికి తోడు ప్రాజెక్ట్ చేతులు మారడం కూడా ఈ రూమర్లకు కారణమైంది.

- Advertisement -

తాజాగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఇప్పటికే “మట్కా” 35 రోజుల షూటింగ్ ను పూర్తి చేశామని, “ఆపరేషన్ వాలెంటైన్” పూర్తి అవ్వగానే మళ్లీ “మట్కా” షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాను వైరా ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుండగా, కొత్తగా రామ్ తాళ్లూరి చెందిన ఎస్ఆర్పి ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగమైంది. మరి కొత్తగా ప్రొడక్షన్ హౌస్ ఎందుకు యాడ్ అయ్యింది? అనే విషయంపై వరుణ్ మాట్లాడుతూ తనకు రామ్ తాళ్లూరి క్లోజ్ అవ్వడంతో ఆయన కూడా ఈ సినిమాకు ప్రొడక్షన్ పార్టనర్ లా జాయిన్ అయ్యారు అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు బడ్జెట్ ఏం ఎక్కువ కాలేదని, ఆగిపోలేదంటూ వరుణ్ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు