Sharwanand : కృంగిపోయా !

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది మొదట్లో శ్రీకారం సినిమాతో ముందుకు వచ్చిన శర్వానంద్.. మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మహాసముద్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. పరవాలేదనిపించాడు. ఆ తర్వాత ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమాతో పరవాలేదనిపించాడు. అయితే తాజాగా శర్వానంద్ హీరోగా.. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ” ఒకే ఒక జీవితం”. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా, అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 9న విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు శర్వానంద్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ సినిమా ఫలితం తీవ్రంగా నిరాశపరిచిందట. ఆ మూవీ ప్లాప్ కావడంతో మూడు నెలలు బయటకు రాలేదని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా? అదే ” పడి పడి లేచే మనసు” 2018లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుండి మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నాం.. కానీ అలా జరగలేదని అన్నారు. ఆ సినిమా ఆడుతుంది అని నమ్మి 130, 140 రోజులు కష్టపడి పని చేశాను అని చెప్పుకొచ్చాడు శర్వానంద్. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఆ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. మళ్లీ ఇప్పుడు ” ఒకే ఒక జీవితం” సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వానంద్.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు