Santhanam: తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు – స్టార్ కమెడియన్..

Santhanam:  తమిళంలో స్టార్ కమెడియన్ గా.. ఇప్పుడు హీరోగా కూడా కొనసాగుతున్న నటుడు సంతానం.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ప్రస్తుతం తాను నటించిన వడక్కు పుట్టి రామస్వామి సినిమా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. అందులో సంతానం మాట్లాడుతూ.. తన స్నేహితుడు అయిన హీరో ఆర్య అప్పుల గురించి మాట్లాడి హాట్ టాపిక్ గా మారారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో ఆర్య గెస్ట్ గా వచ్చారు.

ఇందులో భాగంగానే.. ఆర్య తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం తనకు ఆనందంగా ఉందంటూ సంతానం తెలియజేశారు. ముఖ్యంగా సంతానం తమ అప్పుల గురించి మాట్లాడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. ఆర్య, సంతానం ఇద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సంతానం మాట్లాడుతూ.. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కచ్చితంగా ఆర్య గురించి చాలామంది నేను అడుగుతారు. కానీ అది ఆర్య క్షేమ సమాచారాల కోసం అయితే కాదు.

అయితే మేము చేసిన అప్పుల గురించే అడుగుతారు. మా ఇద్దరిలో ఎవరు కనిపించినా సరే ఒకరి అప్పుల గురించి మరొకరు దగ్గర అడిగేవారు. అంతేకాకుండా మా ఇద్దరికీ కాస్త అప్పులు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం…ఇంత స్టార్ కమెడియన్ అయినప్పటికీ అప్పులేంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు..? ఈ విషయం మాకు ఎక్కడికి వెళ్లినా సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డామని తెలిపారు.

- Advertisement -

అయితే కమెడియన్ గా మంచి ఫామ్ లో కొనసాగిన సంతానం ఒక్కసారిగా హీరోగా మారి తన బ్యానర్ పైన పలు సినిమాలను తెరకెక్కించారు. ఈ క్రమంలోనే అప్పులు చేసి ఉండవచ్చని పలువురు అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల సంతానం నటించిన వడక్కు పట్టి రామస్వామి సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా.. ట్రైలర్ లో కూడా ప్రేక్షకులకు మంచి స్పందన వచ్చింది. కచ్చితంగా ఈ సినిమాతో మరొక విజయాన్ని అందుకుంటారని సంతానం అభిమానులు తెలుపుతున్నారు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు