దళపతి విజయ్ అభిమానులకు ఒక శుభవార్త అనే చెప్పాలి. టాలీవుడ్ దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వంలో వారసుడు మూవీ విడుదలకు సంబంధించి మూవీ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ లో మూవీ షూటింగ్, విడుదలకు సంబంధించి ప్రకటన చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళంలో రానున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రం తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా విడుదల చేస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. వారిసు చివరి షెడ్యూల్ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కానుంది. మరో రెండు పాటలు, రెండు యాక్షన్ సీక్వెన్స్ తీస్తే షూటింగ్ పూర్తి అవుతుంది. 2023 సంక్రాంతికి ఈ సినిమా చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. ఈ అనౌన్స్మెంట్తో సంక్రాంతి బరిలో మరో పెద్ద సినిమా రావడం ఖాయం అయింది.
ఇప్పటికే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు సంక్రాంతి రేస్లో ఉన్నాయి. తాజాగా విజయ్ సినిమా సంక్రాంతికి వస్తుందని ప్రకటించడంతో మూడు సినిమాలు రసవత్తమైన పోరు ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వారసుడు సినిమా ప్రారంభం నుంచి శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది. వంశీ పైడిపల్లితో విజయ్ తీస్తున్న తొలి సినిమా కావడం విశేషం. థమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. ఇప్పటికే విజయ్ 48వ రోజు పుట్టిన రోజు సందర్భంగా వారసుడు ఫస్ట్ లుక్ విడుదల చేసి ఫ్యాన్స్కి సర్ఫ్రైజ్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో విజయ్ సినిమాలు ఏవీ సంక్రాంతికి విడుదల కాలేదు. ఈ సినిమా ప్రకటించడంతో అతని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.