Samantha : హమ్మయ్యా..! ఎట్టకేలకు కెమెరా ముందుకు

ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులందరినీ మాయ చేసిన సమంత గురించి సినీ లవర్స్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ తరువాత ఈగ, మజిలీ, రంగస్థలం, అ ఆ, యూ టర్న్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను తెచ్చుకుంది.

అయితే ఈ భామ ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి భారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ తానె ”యశోద” సినిమా రిలీజ్ కు ముందు సోషల్ మీడియాలో ప్రకటించింది. యశోద సినిమా కు సెలైన్ పెట్టుకొని మరి దుబ్బింగ్ చెప్పిన సమంత, ఆ తరువాత చాల రోజులు ట్రీట్మెంట్ తీసుకుంది. అందుకోసం విదేశాలకు కూడా వెళ్లింది. దీంతో సామ్ సినిమాలు మానేసిందని, ఆమె సినిమాలు చేయడం కష్టమే అంటూ రూమర్స్ వచ్చాయి.

ఈ రూమర్స్ ను సామ్ టీం ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఖండిస్తూ వచ్చారు. తాజాగా సామ్ ప్రస్తుతం కోలుకుంది. ఇటీవల శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు కూడా స్వయంగా హాజరైంది. అంతే కాదు.. శాకుంతలం ప్రమోషన్స్ కి కూడా డేట్స్ ఇచ్చిందని తెలుస్తుంది. అయితే శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కాస్త నీరసంగా కనిపించింది సామ్. దీంతో ఈ స్టార్ హీరోయిన్ పూర్తిగా కోలుకోలేదని వార్తలు వచ్చాయి.

- Advertisement -

అయితే ఈ వార్తలు కూడా రూమర్స్ అని స్పష్టమవుతుంంది. సామ్ మయోసైటిస్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. తన బాలీవుడ్ ఫస్ట్ ప్రాజెక్ట్ సిటాడెల్ వెబ్ సిరీస్ సెట్ లోకి సామ్ వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను సిటాడెల్ లో హీరో పాత్ర చేస్తున్న వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

కాగా సిటాడెల్ వెబ్ సిరీస్ ను దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించబోతున్నారు. ఈ సిరీస్ లో సమంత ‘గూఢచారి’ పాత్రలో కనిపించనుంది.

 

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు