Samantha: ఆ వ్యాధి గురించి అందుకే బయటపెట్టా..కానీ

ఖుషి సినిమా తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంది హీరోయిన్ సమంత.. కొన్నేళ్ల పాటు మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న సమంత ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటోంది.. చాలా కాలం విరామం ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో సొంతంగా ప్రొడక్షన్ కంపెనీని కూడా మొదలుపెట్టింది…TAKE -20 అంటూ ఒక హెల్త్ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసి.. ఆరోగ్యం గురించి నిపుణులతో కలిసి ప్రజలకు కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నది సమంత..

జీవితంలో ఎన్నో ఎత్తు పళ్ళాలు..
వీటితోపాటు వెబ్ సిరీస్ , సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నది.. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ ఛానల్లో సమంత మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం గురించి.. సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నది.. సమంత తన జీవితంలో ఎదురైన సవాళ్లు, ఆరోగ్యం కోసం చేసిన పోరాటం గురించి కూడా వెల్లడించింది.. సమంత నటి గా తన కెరీర్ ను ప్రారంభించి 14 సంవత్సరాల అయిందని.. ప్రతిరోజు దాదాపుగా పది రకాల పనులు చేసేదాన్ని.. కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని అంటూ తెలిపింది..

సమంత మాట్లాడుతూ.. నా మనసుకు విరామం ఇవ్వలేదు.. నా 14 ఏళ్ల సినీ కెరియర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను.. నిజం చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు ఎంతో సంతోషకరమైన క్షణాలను సైతం ఆస్వాదించలేకపోయాను.. ఆ సమయంలో నేను ఇంపోస్టర్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడ్డాను. ఒకరోజు నిద్రలేవగానే అది పోతుందేమోనని భ్రమపడ్డాను కూడా .. నా కెరియర్లో అత్యధిక స్థాయిలో నా సమయం మొత్తం ఈ సిండ్రోమే కే కేటాయించాను.. అందుకే నేను వేటిని ఆస్వాదించలేకపోయాను.. నేనెప్పుడూ విజయాలను తీసుకోలేకపోయాను..నా విజయాలు ఇతరుల వల్ల వచ్చాయని అనుకున్నారు..కానీ ఇప్పుడు నాకు నేనుగా నాకు నచ్చినట్టుగా ఉన్నాను.. ఇప్పుడు సంతోషంగా అనిపిస్తోందంటూ తెలిపింది సమంత.

- Advertisement -

అప్పుడే మయో సైటిస్ పై ప్రకటన..
ఇక మయోసైటిస్ గురించి జనాలకు తెలియజేయాలనుకున్నాను.. ఎందుకంటే నేను నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ కు దూరంగా ఉండాలనుకున్నాను.. అప్పట్లో నా గురించి చాలా రూమర్స్ వచ్చాయి.. ప్రచారం చేయకపోతే సినిమా చనిపోయేలా ఉందని నిర్మాతలు చెప్పడంతో కేవలం ఒక్క ఇంటర్వ్యూకు మాత్రమే వచ్చానని తెలిపింది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా చాలామంది బలవంతం చేయడంతో మయోసైటిస్ గురించి తెలియజేయాల్సి వచ్చిందని సమంత వెల్లడించింది.. ఆ సమయంలో తనను తాను స్థిరంగా ఉంచుకోవడానికి… ఒకేలా కనిపించడానికి ఎక్కువ మోతాదులో మందులు తీసుకున్నాను అంటూ తెలిపింది సమంత.. సినిమా కోసమే బయటికి రావాల్సి వచ్చింది.. లేకపోతే మయోసైటిస్ గురించి ప్రకటించనని కూడా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

సమంత సినిమాలు..
ప్రస్తుతం సమంత ఖుషీ సినిమా తర్వాత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది..

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు