Rishab Shetty.. నటుడిగా అతి చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోగా అలరించి.. కొన్నాళ్లకు మెగా ఫోన్ చేత పట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు.. ప్రముఖ హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి.. ఆరవ తరగతిలోనే నాటకం పై ఉన్న ఇష్టంతో వేసిన పాత్ర సినీ రంగంపై అడుగులు వేసేలా చేసింది. చివరికి అదే పాత్ర ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది.. ఒకే ఒక్క సినిమాతో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొని.. అందరూ తన గురించి మాట్లాడేలా చేశారు.. ఏకంగా తన సినిమాను ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శించారు..
ఆ పాత్రతో ప్రపంచ స్థాయి గుర్తింపు..
కన్నడ సినీ పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. కిరిక్ పార్టీ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు.. అయితే ఈయనకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని అందించిన చిత్రం మాత్రం కాంతారా అని చెప్పాలి.. 2022లో ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వం వహించిన సినిమా కాంతారా.. ముందుగా కన్నడలో రిలీజ్ అయ్యి అక్కడ భారీ విజయాన్ని అందుకున్న తర్వాత తెలుగు, తమిళ్, హిందీ ,మలయాళం భాషలో రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఊహించని రెస్పాన్స్ లభించడంతో పాటు జాతీయ స్థాయిలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం విశేషం.
ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శన..
2023లో జరిగిన ఐక్యరాజ్యసమితిలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా.. అక్కడికి ముఖ్య అతిథిగా రిషబ్ శెట్టి హాజరయ్యారు. అంతేకాదు ఇందులో రిషబ్ శెట్టి పంజర్ల వేషధారణలో చేసిన యక్షగాన పెర్ఫార్మన్స్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించడమే కాదు అందరినీ ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.. అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన పంజర్లీ పాత్రతోనే దశాబ్దాల క్రితం నటుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టారట రిషబ్ శెట్టి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఆర్టిస్ట్ గా నా ప్రయాణం నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడే మొదలయ్యింది.. నేను ఆ సమయంలో యక్షగానం ప్రదర్శించాను.. అప్పటినుంచి నా ప్రాంతపు జానపద కథలను ప్రజల ముందుకు తీసుకురావాలనేదే నా చిరకాల కోరిక అంటూ చెప్పుకొచ్చారు..
కాంతారా క్రేజ్..
కాంతారా క్రేజ్ ఎలా ఉందంటే ఇప్పటికీ ఈ సినిమాను అక్కడక్కడ ప్రదర్శిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పంజర్లీ పర్ఫామెన్స్ యూట్యూబ్లో ప్రేక్షకులు చూస్తూనే ఉంటారనటంలో సందేహం లేదు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దాదాపుగా రూ.300 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్ ను తెరకెక్కించే పనిలో పడ్డారు రిషబ్ శెట్టి.. ఇకపోతే తాజాగా రిషబ్ శెట్టి తన ఆరవ తరగతి చదువుతున్నప్పుడు వేసుకున్న యక్షగాన ప్రదర్శనకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఇది అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆరవ తరగతి చదువుతున్న సమయంలోనే ఇంతటి కళాత్మకమైన ఆలోచన ఈయన లో కలిగిందా అంటూ ఈయన జ్ఞాన బుద్ధికి అందరూ ఫిదా అవుతున్నారు.
View this post on Instagram