Rashmika Mandanna : టాలీవుడ్ కు దూరం దూరం

టాలీవుడ్ చిన్న పరిశ్రమ కాదు.. పెద్ద పరిశ్రమ అని అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. దీనికి కారణాలు కూడా అందరికీ తెలుసు. దేశంలో పెద్ద పరిశ్రమగా పేరున్న బాలీవుడ్ ను సైతం తిప్పుకుంది టాలీవుడ్. ఈ జూలై నెలలో కొన్ని సినిమాలు విఫలమైనా, తాజాగా సీతారామం, బింబిసారతో మరోసారి టాలీవుడ్ సత్తా చాటుతుంది. అలాగే టాలీవుడ్ నటీనటులకు బాలీవుడ్ లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.

ఇప్పటికే కొంత మంది హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టారు. అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ, అప్పుడప్పుడు టాలీవుడ్ లో కూడా కనిపిస్తున్నారు. కానీ, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా మాత్రం పూర్తిగా బాలీవుడ్ కే మొగ్గుచూపుతుంది. పుష్ప ది రైజ్ తర్వాత ఇప్పటి వరకు ఒక తెలుగు సినిమాకు కూడా రష్మికా మందన్నా సైన్ చేయలేదు.

బాలీవుడ్ లో నేషనల్ క్రష్ ప్రస్తుతం గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమల్ సినిమాలు చేస్తుంది. మరో కొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కానీ తెలుగులో పుష్ప ది రూల్ సినిమాలో మాత్రమే నటిస్తుంది. దీంతో పాటు తమిళ-తెలుగు సినిమా వారసుడులో నటిస్తుంది. గతంలో రష్మికా మందన్నా వరుసగా తెలుగులో సినిమాలు చేసింది.
కానీ, పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చిన వెంటనే ముంబైలోనే సెట్ అయి అక్కడే సినిమాలు చేస్తుంది. దీనిపై తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాలో ఫేమస్ అయి, ఇప్పుడు టాలీవుడ్ కు దూరంగా ఉండటం సరికాదని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు