కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే పుష్ప, సీతారామం వంటి సినిమాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ కావడం విశేషం. ముఖ్యంగా పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం తెలుగుతో పాటు హింది, తమిళ భాషల్లో వరస ఆఫర్లతో రాణిస్తోంది. హిందీలో ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్న రష్మిక తమిళంలో విజయ్ దళపతి సరసన వరిసు సినిమాలో నటిస్తోంది.
అదేవిధంగా తెలుగులో పుష్ప సీక్వెల్ లో కూడా నటిస్తోంది. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషనల్లో వచ్చే సినిమాలో రష్మిక హీరోయిన్గా సెలెక్ట్ అయినట్టు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో జాన్వీకపూర్, అలియా భట్, దీపికా అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్టీఆర్ కి జోడిగా రష్మికను ఫైనల్ చేశారట మూవీ మేకర్స్. అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ చిత్రం కోసం రష్మిక ఏకంగా రూ.5కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పారితోషికాన్ని ఏకంగా డబుల్ చేసిందట. భారత బాక్సాఫీస్ వద్ద మోస్ట్ డిమాండ్ హీరోయిన్ రష్మికనే కావడం విశేషం. సౌత్ అత్యధిక మంది ఫాలోవర్లను కలిగి ఉన్న హీరోయిన్ కూడా రష్మికనే కావడం విశేషం. రష్మికకు రూ.5కోట్లు పారితోషికం ఇచ్చేందుకు కూడా మూవీ మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.