BRO: పవన్ కళ్యాణ్ ని ఎంజీఆర్ తో పోల్చిన ఆ నిర్మాత!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన తాజా చిత్రం “బ్రో“. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా మంగళవారం రాత్రి జరిగింది. సినీ ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో హీరో,హీరోయిన్ల తో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు, అలాగే చిత్ర నటీనటులు పాల్గొనడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం కూడా అతిధిగా రావడం జరిగింది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడిన స్పీచ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

నిర్మాత ఏ ఎం రత్నం పవన్ కళ్యాణ్ తో ఇంతకు ముందే ఖుషి, బంగారం లాంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు” సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన నిర్మాత ఏ ఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో తన తొలి చిత్ర విశేషాలను ప్రస్తావిస్తూ, పవన్ కళ్యాణ్ ని తాను ఒక ఎంజీఆర్ లా భావిస్తానని అన్నాడు.

తమిళనాడు లో ఎంజీఆర్ తన ప్రతి సినిమాలో యువతను మేల్కొలిపేలా ఒక సందేశాత్మక పాటను పెడతారు అని అన్నారు. ఆ పాట ద్వారా అభిమానుల్ని ఎంతో ఇన్స్పైర్ చేసేవారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా తన ప్రతి సినిమాలో యువతకి స్పూర్తినిస్తూ ఆయన ప్రతి చిత్రంలోనూ ఒక పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చే సాంగ్ ని రాయించుకుంటారని, ఆయన ఆలోచన వల్లే ఖుషిలో హిందీ సాంగ్ పెట్టడానికి ధైర్యం చేశామన్నారు.

- Advertisement -

అలా పవన్ కళ్యాణ్ ఐడియాతో ఖుషి చిత్రంలో పెట్టిన “యే మేరా జహ” సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో మనకి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న హరిహరవీరమల్లు చిత్రం ఆగిపోలేదని, వర్కింగ్ లోనే ఉందని అన్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు