Prabhas : పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న రెండో సినిమా సీతారామం. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ కథ, పడి పడి లేచే మనసు లాంటి ప్రేమ కావ్యాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. వైజాయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. అద్భుతమైన ప్రేమ కథగా సినిమా వస్తున్నట్టు తెలుస్తుంది.

మంగళవారం సీతారామం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అతికొద్ది ప్రేక్షకుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర బృందం. ఈ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చారు. ఈవెంట్ లో ప్రభాస్ అదిరిపోయే లుక్ లో కనిపించారు. అలాగే ఈవెంట్ లో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓటీటీల ఆదరణ పెరగడం, థియేటర్స్ కు జనాలు రావడం తగ్గడంపై ప్రభాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

”ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా. మాకు థియేటర్స్ కూడా గుడిలాంటివే. సీతారామం లాంటి సినిమాను తెరకెక్కించాలంటే మామూలు విషయం కాదు. కొన్ని సినిమాలను థియేటర్స్ లోనే చూడాలి. అలాంటి సినిమానే సీతారామం. ప్రతి ఒక్కరు థియేటర్లకు వచ్చి సినిమా చూడండి ” అంటూ ప్రభాస్ ప్రేక్షకులను కోరాడు. దీనికి ముందు నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడుతూ .. ”ప్రభాస్ ఎవరి కోసం రాడు. ఈ రోజు మా కోసం వచ్చాడు. సినిమాను బతికించడానికి వచ్చాడు” అంటూ కామెంట్స్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు