రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ మూవీ అప్టేట్ ఎట్టకేలకు వచ్చేసింది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాలు తీసినప్పటికీ ఆ సినిమాలు ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. వీటి తరువాత ప్రభాస్ ఆదిపురుష్, సలార్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఈ సినిమా షూటింగ్ పూర్తయి దాదాపు మూడు నెలలు గడుస్తున్నప్పటికీ సినిమాకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ కూడా ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అభిమానులకు దర్శకుడు ఓంరౌత్ శుభవార్త చెప్పారు. ఆదిపురుష్ సినిమా ఫస్ట్ లుక్తో పాటు టీజర్ను అక్టోబర్ 2న అయోద్యలోబ్యాంకు ఆఫ్ సరయూ గ్రౌండ్లో జరిగే దసరా ఉత్సవాల్లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ చిన్న అప్డేట్తో అభిమారులు తెగ సంతోషపడుతున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. సీతగా హీరోయిన్ కృతిసనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటించనున్నాడు. టీ-సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను యూవీ క్రియేషన్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.