Pooja Hegde : నన్ను నేను మైమరిచిపోయాను

కన్నడ సినిమా ‘కాంతారా’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం కర్ణాటకలోనే కాకుండా తెలుగు, హిందీ వర్సెన్ లలో విడుదలైన రాష్ట్రాల్లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యుఎస్ లో సైతం ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉంటూ కొత్త సినిమాలకు విపరీతమైన పోటీని ఇస్తోంది. కర్ణాటకలో ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలైంది. ఆ తరువాత హిందీలో అక్టోబర్ 14, తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ అయింది. మొత్తం మీద అన్ని భాషల్లో కలుపుకొని ఈ సినిమా సుమారు రూ. 220 గ్రాస్ వసూలు చేసింది.

ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని, ముఖ్యంగా క్లైమాక్స్ బూస్ బంప్స్ తెప్పిస్తుందని ప్రభాస్ లాంటి స్టార్లు కొనియాడారు. ఇప్పుడు ఆ జాబితాలో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కూడా చేరారు. తాజాగా ‘కాంతారా’ సినిమా చూసిన బుట్ట బొమ్మ, తన అభిప్రాయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, ఈ సినిమా ద్వారా తన మూలాలను గుర్తు చేసుకున్నారు.

“మీకు ఏం తెలుసో దాన్నే రాయండి. మీ హృదయానికి చేరువైన, మనసులో నుంచి వచ్చిన కథలనే చెప్పండి. సినిమాలోని ఆఖరి 20 నిమిషాలు చలించిపోయాను. పూర్తిగా నన్ను నేను మైమరిచిపోయాను. రిషబ్ శెట్టి, ‘కాంతారా’ విశేషమైన ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉంది. నా చిన్నతనంలో చూసిన భూత కోలాలు వెండితెర మీద గౌరవప్రదంగా, అందంగా ఆవిష్కరించారు. మీరు మరిన్ని మంచి సినిమాలు తీయాలి. మరింత ఎత్తుకు ఎదగాలి” అని పూజా హెగ్డే తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు