Nithin : కాంబో రిపీట్‌

హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో నితిన్. ఇటీవల నితిన్ నటించిన “మాచర్ల నియోజకవర్గం” సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్ మరియు పాటలతో ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలను రేపిన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోవడం బాధాకరం.
ఇక ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నితిన్ కెరీర్ ఓ మంచి హిట్ కొట్టిన చిత్రం భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వంలో 2020లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే వెంకీ కుడుముల – నితిన్ కాంబోలో ఇప్పుడు మరో మూవీ రానున్నట్లు టాలీవుడ్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకీ కుడుముల ఈ స్టోరీ నీ ముందుగా మెగాస్టార్ చిరంజీవికి చెప్పారట.
మెగాస్టార్ ఇమేజ్ కి తగినట్లు మార్పులు చేసినప్పటికీ వెంకీ కుడుముల తన కథతో చిరంజీవిని మెప్పించలేకపోయారట. ఈ కథ ఏమాత్రం చిరంజీవికి నచ్చక పోవడంతో దీనిని తిరస్కరించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అదే కథలో మరిన్ని మార్పులు చేసి హీరో నితిన్ ని కలిశారట వెంకీ కుడుముల. నితిన్ కి కూడా ఈ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఈ ప్రాజెక్టు పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ మూవీని మైత్రి సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం.
Previous article
Next article

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు