అక్కినేని నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఘోస్ట్’. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆదివారం రాత్రి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించారు. ఈ వేడుకలో అక్కినేని నాగచైతన్య, అఖిల్ సందడి చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దాదాపు 33 ఏళ్ల కిందట అక్టోబర్ 5న రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడు చైన్ చేతపట్టుకుని వచ్చాను. ఈసారి అదే అక్టోబర్ 5న కత్తి పట్టుకుని వస్తున్నాను చెప్పాడు నాగార్జున. దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి యాక్షన్, డ్రామా అంటే చాలా ఇష్టం. ఈ రెండు కలిపి ‘ది ఘోస్ట్’ సినిమా తీశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ సోనాల్కి శిక్షణ ఇప్పించి మరీ ఈ సినిమా చేశారు.
ఈ ఏడాది సంక్రాంతికి నాగచైతన్యతో ‘బంగార్రాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. త్వరలో అఖిల్తో కలిసి నటిస్తున్నాను అని చెప్పారు. ‘అన్నమయ్య’ సినిమా సందర్భంలో కర్నూలుకి వచ్చాను. మళ్లీ ఇప్పుడు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అక్టోబర్ 5న నా ఫ్రెండ్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ప్రకటించారు నాగార్జున. అక్టోబర్ 5న విడుదలయ్యే ‘ది ఘోస్ట్’, ‘గాడ్ ఫాదర్’ రెండు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో వేచి చూడాలి.