టాలీవుడ్ హీరో నాగశౌర్య ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది. 2011లో క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేకంగా ఓ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకున్న నాగశౌర్య త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడు. గతంలోనే ఇతని పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు తాజాగా నాగశౌర్య పెళ్లికి ముహూర్తం ఖరారు అయింది.
నవంబర్ 20న నాగశౌర్య, అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. కర్ణాటకకు చెందిన అనూష శెట్టి ది మంగుళూరు దగ్గరలోని కుందాపూర్. ఈమె ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో నిష్ణాతురాలు. అలాగే అనూష ఉమెన్ అచీవర్స్ లో ఒకరుగా గుర్తింపు కూడా తెచ్చుకుంది. అనూష శెట్టి పలు ప్రముఖ కంపెనీలకు ఇంటీరియర్ డిజైనర్ గా పని చేసింది. 2021 నవంబర్లో ఉమెన్ ఎంటర్ప్రిన్యూర్ మ్యాగజైన్ కవర్ పేజీపై అనూష శెట్టి ఫోటో వేశారంటే ఆ రంగంలో ఆమె ఎంత నిష్టాతురాలో అర్థమవుతుంది. కాగా, ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూషతో నాగశౌర్యకు బెంగుళూరులో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. మరోవైపు నాగశౌర్య బ్రదర్ కూడా కర్ణాటకకు చెందిన యువతినే పెళ్లిచేసుకోవడం గమనార్హం.
హిందూ సంప్రదాయం ప్రకారం.. నవంబర్ 20న నాగశౌర్య, అనూష శెట్టిల పెళ్లి బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ అనే ప్రముఖ హోటల్లో జరుగనుంది. నవంబర్ 19న మెహిందీ ఫంక్షన్ నిర్వహించనున్నారు. దాదాపు వారం రోజుల ముందే నాగశౌర్య ఇంట్లో పెళ్లిసందడి మొదలుకానుందన్నమాట. ఈ పెళ్లి వేడుకకి ఇరు కుటుంబాలకు సంబంధించిన కొద్ది మంది బంధువులు మాత్రమే పాల్గొనే అవకాశముంది. నాగశౌర్యకి క్లోజ్ ఫ్రెండ్స్ అయినటువంటి కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యే ఛాన్స్ ఉంది. పెళ్లి బెంగళూరులో జరుగుతుంది కాబట్టి పెళ్లి తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులకు ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేయాలని నాగశౌర్య కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారట.