Nadikar thilakam : మలయాళం సినిమాల్లోకి మైత్రి మూవీస్ ఎంట్రీ- పెద్ద ప్లానింగే ఇది

టాలీవుడ్ స్టార్ హీరోలతో, భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ టాలీవుడ్ లోనే లీడింగ్ నిర్మాణ సంస్థగా పేరున్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు తెలుగు సినిమాలతో పాటు మలయాళం సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. ఇటీవలనే సూపర్ హిట్టైన 2018 సినిమా ఫేం టోవినో థామస్ హీరోగా మాలీవుడ్ లో రాబోతున్న కొత్త సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ మలయాళం సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్టు కాసేపటి క్రితం ప్రకటించింది.

మలయాళ సూపర్ స్టార్ పృథీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరక్టర్ లాల్ jr దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను గాడ్ స్పీడ్ అనే మలయాళ నిర్మాణ సంస్థతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ మార్కెటింగ్ చేయబోతుంది. కన్నడ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ సంస్థకు పోటీగా మైత్రి మూవీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.

నడికర్ తిలకం అనే పేరుతో రాబోతున్న ఈ సినిమా కొచ్చిలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. దాదాపు 120రోజుల పాటు షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా గురించి మరిన్ని డిటేల్స్ తొందరలోనే రానున్నాయి.మలయాళం లీడింగ్ యాక్టర్స్ దసరా ఫేం షైన్ టామ్ చాకో, రోమాంచన్ ఫేం సౌబిన్ షాహిర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు