Karthikeya 2 : అనుకున్నదే జరిగింది

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం కార్తికేయ-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. హీరో నిఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమాకు ప్రారంభం నుంచి కష్టాలే ఎదురవుతున్నాయి. 2017లోనే ప్రకటన వచ్చినా, షూటింగ్ ప్రారంభమవడం మాత్రం 2021 ఫిబ్రవరిలో జరిగింది. నిజానికి 2020లోనే షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, కరోనా ప్రభావంతో అది జరగలేదు. 2021లో షూటింగ్ స్టార్ట్ అయ్యాకా, సూపర్ స్పీడ్ లో షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది కార్తికేయ-2.

ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన సమయంలో హీరో నిఖిల్ తండ్రి చనిపోయాడు. ఆ బాధతో పాటు డబ్బింగ్ పనులు కూడా ఆలస్యమయ్యాయి. ఇలా ఎన్నో కష్టాలను దాటుకుంటూ జూలై 22న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఆ సమయంలో సినిమాను ఓ బడా నిర్మాత దగ్గరుండి మరీ వాయిదా వేయించాడని టాక్. చేసేదేమీ లేక జూలై పోటీ నుంచి తప్పుకున్నారు. ఆగస్టు 12న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని అనుకున్నారు. పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు.

అలా చేసినా, కార్తికేయ-2 పై ఒత్తడి తగ్గలేదు. ఓ సందర్భంలో “నా లాంటి బ్యాగ్రౌండ్ లేని హీరోలు సినిమాలను విడుదల చేసుకోవడం ఈ రోజుల్లో కష్టమే. జూలై 22 వద్దు అన్నారు. తప్పుకున్నాం. ఇప్పుడు ఆగస్టు 12 నుంచి కూడా తప్పుకొమ్మని అంటున్నారు” అంటూ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన సినిమా కష్టాలను చెప్పుకున్నాడు. అయినా, సినిమా వాయిదా వేయలేమని నిఖిల్ గట్టిగానే చెప్పాడు.

- Advertisement -

కానీ, బడా నిర్మాత ఒత్తిడికి కార్తికేయ-2 తలొగ్గాల్సి వచ్చింది. ఈ సినిమా ఆగస్టు 12 నుంచి 13కు వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా అనుకున్నదే జరిగింది. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేని హీరో పవర్ ఫుల్ నిర్మాతలకు తగ్గాల్సి వచ్చింది. సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు