Kamal Hassan: ఆమె కాళ్ళపై పడి బోరున ఏడ్చిన కమల్ హాసన్.. కారణం..?

విశ్వ నటుడిగా లోకనాయకుడిగా పేరు దక్కించుకున్న కమల్ హాసన్ నేటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అంటే ఆయనకు సినిమాల పైన మక్కువ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ఎవరు ఉన్నారని చూడకుండా ఆ పాత్రకు మనం న్యాయం చేస్తున్నామా లేదా అన్నది మాత్రమే ఆలోచిస్తారు. కాబట్టి నేడు లోక నాయకుడిగా పేరు దక్కించుకున్నారు.. ఈ నేపథ్యంలోనే సినిమాలలో భాగంగా ఒక నటి.. తన కాళ్లపై పడి బోరున ఏడ్చారు కమలహాసన్ అంటూ ఒక విషయాన్ని వెల్లడించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సినీ ఇండస్ట్రీలో నటిగా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్న డబ్బింగ్ జానకి దాదాపు 1000 కంటే ఎక్కువ చిత్రాలలో నటించి పాపులారిటీ సొంతం చేసుకుంది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ కెరియర్ లో ఎదుర్కొన్న పలు విషయాల గురించి వెల్లడించింది.. డబ్బింగ్ జానకి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక్కో సమయంలో తినడానికి కూడా తిండి లేక నా పిల్లల కడుపు నింపడానికి నూకలు కూడా వండి పెట్టిన సందర్భాలు ఉన్నాయి.. ఇతరుల దగ్గర ఏమీ లేనట్టు నిలబడకూడదని భావించే వాళ్ళం.. అందుకే ఎవరిని కూడా అప్పు అడగలేదు.. నా ఉద్దేశం ఒకటే కష్టాలు వచ్చినా.. తినడానికి తిండి లేకపోయినా.. ఎదుటివారి దగ్గర మనల్ని మనం తక్కువ చేసి చూపించుకోకూడదు.. అందుకే ఎవరి దగ్గర నేను అప్పు అడగకూడదని భావించాను..

నాకు ఇండస్ట్రీలో కూడా సపోర్టుగా ఎవరూ లేరు. నా కష్టంతోనే నేను ఎదిగాను.. ముఖ్యంగా డైరెక్టర్ల ఇళ్లకు వెళ్లి మరీ అవకాశాలు ఇవ్వమని నేను అడిగేదాన్ని.. ఇండస్ట్రీలో ఎవరితో కూడా నేను క్లోజ్ గా ఉండలేదు.. నా పని మాత్రమే నేను చూసుకుంటాను.. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప నటీనటులు ఉన్నారు.. కానీ వారిలో నాకు సావిత్రి అంటే చాలా ఇష్టం.. ఆమె చేసిన ఎన్నో పాత్రలు నాకు నచ్చుతాయి అంటూ తెలిపారు డబ్బింగ్ జానకి.. ఇక సాగర సంగమం సినిమా గురించి మాట్లాడుతూ.. కే విశ్వనాథ్ తో దాదాపు 17 సినిమాలు చేశాను.. అందులో సాగరసంగమం సినిమాలో ఒక సన్నివేశంలో కమలహాసన్ నా కాళ్ళ మీద పడి ఏడ్చారు.. అయితే థియేటర్ లో ఆ సీన్ చూసినప్పుడు చాలామంది అభిమానులు కోపగించుకున్నారు.. సూపర్ స్టార్ అయ్యుండి ఆమె కాళ్ళ మీద పడడం ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

నిజానికి కొంతమందికి ఇగోస్ ఉంటాయి కానీ కమల్ హాసన్ మాత్రం ఆ సీన్ ను సీన్ లా మాత్రమే చూసి.. ఆకట్టుకున్నారు.. అంటే అక్కడ కమల్ హాసన్ , డబ్బింగ్ జానకి కాదు.. పాత్రలు మాత్రమే ఉంటాయి.. ఆ ఉద్దేశంతోనే ఆయన పాత్రలు చేశారు అంటూ డబ్బింగ్ జానకి వెల్లడించింది ..ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఏది ఏమైనా కమల్ హాసన్ గొప్ప నటుడు అని మరోసారి తన మాటలతో వెల్లడించింది డబ్బింగ్ జానకి. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఈమె ఈటీవీ లో ప్రసారమవుతున్న శతమానం భవతి వంటి ధారావాహికలలో నటిస్తోంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు