Janhvi Kapoor : ఛోటే మియాకు జోడీ గా..

జాన్వీ కపూర్, చేసింది కొన్ని సినిమాలే. అయినా ఈమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రపంచం మెచ్చిన సుందరి శ్రీ దేవీ కూతిరిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చు కుంది. తొలి చిత్రం ధడక్ తో కమర్షియల్ హిట్ అందుకుంది. అలాటే గుంజన్ సక్సేనా కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇటీవల వచ్చిన గుడ్ లక్ జెర్రీ మాత్రం నిరాశ పరిచింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ.. మిలి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్ అనే సినిమాలు చేస్తుంది. దీంతో పాటు మరో సినిమాకు కూడా జాన్వీ సైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అక్షయ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలల్లో వస్తున్న చిత్రం బడే మియా ఛోటే మియా. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రాబోతుంది. దీనిలో అక్షయ్ జోడీగా హీరోయిన్ ఉండదట. కానీ టైగర్ ష్రాఫ్ సరసన హీరోయిన్ ఉంటుందట. అందు కోసం జాన్వీనే తీసుకోవాలని దర్శకుడుఅనుకున్నట్లు సమాచారం. జాన్వీని సంప్రదించడంతో ఆమే ఫైనల్ అయిందని టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రం చిత్రీకరణ షెడ్యూల్ నవంబర్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ పాల్గొంటుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు