Money Laundering : బిగుస్తున్న ఉచ్చు

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. పరిచయం అవసరం లేని పేరు. ఈ భామకు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ మంచి క్రేజ్ ఉంది. శ్రీలంకకు చెందిన ఈ నటి, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. అనంతరం శ్రీలంక తరపున 2006లో మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది. అనంతరం బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, మర్డర్ 2తో  గుర్తింపు తెచ్చుకుంది.

ప్రభాస్ సాహో సినిమాలో ఐటెం సాంగ్ చేసి సౌత్‌ ఆడియన్స్‌కు దగ్గరైంది. దీని తర్వాత సౌత్ లో కూడా ఈ శ్రీలంక సుందరికి ఫాలోయింగ్ వచ్చింది. అయితే తాజాగా ఈ భామ మెడ చుట్టూ ఒక వివాదం చుట్టుకుంది. దీనికి కారణం ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ తో ఈ హీరోయిన్ కు ఉన్న సంబంధమే. సుకేష్ తో జాక్వెలిన్ చాలా సన్నిహితంగా ఉండేది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయ్యాయి. దీనిపై ఈడీ అధికారులు జాక్వెలిన్ ను విచారించారు.

తాజాగా జాక్వెలిన్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. సుకేష్ మనీ లాండరింగ్ కేసు ఛార్జ్ షీట్‌లో జాక్వెలిన్ పేరును ఈడీ చేర్చింది. సుకేష్ దోపిడీ చేసిన డబ్బు తో ఈ నటి లబ్ధి పొందారని అధికారులు గుర్తుంచినట్లు వెల్లడించారు. అందుకే ఛార్జీ షీట్ లో ఈ హీరోయిన్ పేరు చేర్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో జాక్వెలిన్ కు సుకేష్ రూ.10 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. అందుకే జాక్వెలిన్ కు చెందిన దాదాపు రూ. 7 కోట్లు ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు