బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, హీరోయిన్ సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్ వేద’. ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్ననేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ వార్త ప్రస్తుతం బాలీవుడ్ని షేక్ చేస్తోంది. విక్రమ్ వేద సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైంది. ఏకంగా 100 దేశాల్లో విడుదల చేయనున్నట్టు చిత్రం బృందం వెల్లడించింది.
ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, 22 యూరప్ దేశాలతో పాటు ఆఫ్రికాలోని 27 దేశాల్లో విడుదల కానుంది ఈ చిత్రం. వీటిలో బాలీవుడ్కి అంతగా పట్టులేని జపాన్, రష్యా, పెరూ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా గురించి రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఓవర్సీస్ బిజినెస్ అధినేత ధ్రువ సిన్హా వెల్లడించారు. ఈ చిత్రాన్ని దాదాపు అందరూ ఆదరిస్తారని, ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటుంది అని చెప్పారు.
తమిళంలో విడుదలై విజయంతమైన ‘విక్రమ్ వేద’ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో రీమెక్ చేస్తున్న విషయం తెలిసిందే. పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇందులో మాధవన్, విజయ్ సేతుపతి, ప్రధాన పాత్రలో నటించారు. తమిళ విక్రమ్ వేదకు దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రి ఈ హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఎస్.శశికాంత్, భూషణ్కుమార్ నిర్మించారు. ఇందులో రాధికా ఆప్టే ఓ కీలక పాత్రలో నటించారు. 100 దేశాల్లో విడుదల చేసే ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 30 వరకు వేచి చూడాల్సిందే.