Nagarjuna : చాలా హ్యాపీ !

టాలీవుడ్‌లో బెస్ట్ క‌పుల్‌గా చెప్పుకున్న నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకులు ప్ర‌క‌టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా 2017 అక్టోబ‌ర్ నెల‌లో వారు పెళ్లి చేసుకుంటే.. 2021 అక్టోబ‌ర్‌లో వారు విడాకులు ప్ర‌క‌టించారు. విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా ఉన్నారు. ఓవైపు స‌మంత వ‌రుస సినిమాల‌తో బిజీబిజీగా గ‌డుపుతోంది. అదేవిధంగా కొద్ది రోజులుగా మోటివేటివ్ కొటేష‌న్స్ కూడా పోస్ట్ చేసింది.

నాగ‌చైత‌న్యతో కూడా త‌న సినిమాల‌తో పుల్ బిజీగానే గ‌డుపుతున్నాడు. వీరు విడాకులు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ వీరు ఎందుకోసం విడాకులు అనే విష‌యాన్ని మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌స్తావించ‌లేదు. వీరిద్ద‌రు విడిపోయిన త‌రువాత సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపించాయి. కొన్ని సంద‌ర్భాల్లో అయితే స‌మంత కోర్టును కూడా ఆశ్రయించింది. కొంత మంది నెటిజ‌న్లు నాగ‌చైత‌న్య‌దే త‌ప్పు అన‌గా.. మ‌రికొంద‌రూ స‌మంత‌దే త‌ప్పు అని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో నాగ‌చైత‌న్య‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై మీ అభిప్రాయం ఏంటి అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా నాగార్జున స్పందిస్తూ.. చైత‌న్య ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. పెళ్లి చేసుకుని విడిపోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మే. దానిని ఒక అనుభ‌వంగా తీసుకోవాలి. దాని గురించే అస‌లు ఆలోచించ‌కూడ‌దు. జ‌రగాల్సింది ఏదో జ‌రిగిపోయింది. ప్ర‌జ‌లు కూడా ఈ విష‌యాన్ని మ‌రిచిపోతార‌ని నేను అనుకుంటున్నాను అని నాగార్జున చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు