Tollywood: భోళా ని తట్టుకోగలడా? లేదా వెనక్కి తగ్గుతాడా ?

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రాన్ని తెలుగు లో భోళాశంకర్ గా రీమేక్ చేస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ స్టోరీ రూపొందుతుండగా, చిరుకు చెల్లెలి గా కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా ఈ సినిమా లో తమన్నా హీరోయిన్. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాను ఆగస్ట్ 11 న విడుదల చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 80 శాతం షూట్ కంప్లీట్ అయిన ఈ సినిమా త్వరలోనే మిగతా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్లు స్టార్ట్ చేస్తారు.

ఇదిలా ఉండగా సిద్ధూ జొన్నల గడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డీజే టిల్లు స్క్వేర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన డీజే టిల్లు కి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించిన ఈ సినిమా కూడా ఆగస్ట్ 11 న విడుదలకు డేట్ లాక్ చేసుకుంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం డీజే టిల్లు రిలీజ్ వాయిదా వేశారు అని టాక్. కారణం థియేటర్ల సమస్యే అని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. మెగాస్టార్ సినిమా విడుదల అవుతున్న రోజు తమ సినిమా రిలీజ్ చేస్తే థియేటర్ల సమస్య వస్తుంది. అలాగే అంత పెద్ద హీరో సినిమా ఉండగా డీజే టిల్లు చూస్తారా అంటే డౌటే. అంతే కాక అదే రోజు ఇతర భాషల్లో మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న మహావీరుడు సినిమాను ఆగస్ట్ 11 నే రిలీజ్ చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అంతే కాకుండా హిందీలో సందీప్ వంగ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆనిమల్ మూవీని కూడా ఆగస్ట్ 11 న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ చెప్పడం జరిగింది. ఈ సినిమా లో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. కాబట్టి ఇన్ని సినిమా ల మధ్య పోటీగా డీజే టిల్లు విడుదల కావడం కరెక్ట్ కాదని, ఈ సినిమా రిలీజ్ ని రెండు వారాలు ముందు లేదా వెనక్కి జరిపే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారని టాక్ నడుస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు