Gowtam Tinnanuri: సినిమా ఆగిపోయిందా ?

తన మొదటి సినిమా “చిరుత” తోనే చిరు తనయుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్. తర్వాత చరణ్ కెరియర్లో వచ్చిన మగధీర సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన ఆరెంజ్ సినిమా అప్పట్లో ఆకట్టుకోలేదు. కానీ ఇప్పటికి ఆరెంజ్ సినిమాను ఇష్టపడే అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ కెరియర్ లో అదిరిపోయే హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ చెప్పుకోదగ్గ లవ్ స్టోరీ ఆరెంజ్ మినహా ఇంకోటి లేదు.

ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు చరణ్. రామ్ పాత్రలో చరణ్ నటించిన తీరు మంచి ప్రశంసలను తీసుకుని వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఏకంగా రామ్ చరణ్ రాముడిలా ఫీల్ అయి ఆకర్షితులు అయ్యారు. ట్రిపుల్ ఆర్ సినిమా తరవాత చరణ్ నుంచి రాబోయే సినిమాల అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న చరణ్ ఆ సినిమా తరువాత జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఆ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన జెర్సీ సినిమాకి తెలుగులో మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ కలక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదనేది వాస్తవం. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే అక్కడ చేదు అనుభవమే ఎదురైంది. ఈ రీమేకే గౌతమ్ కెరియర్ అడ్డుపడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. చరణ్ క్రేజ్ అమాంతం పెరిపోయిన తరుణంలో మళ్ళీ గౌతమ్ లాంటి క్లాస్ దర్శకుడితో పనిచేస్తే ఎంతవరకు కలిసొస్తుంది అనే ఆలోచనలో ఉన్నాడట చరణ్. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చినంతవరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు