Fahadh Fassil: పాన్ ఇండియా ఫిలిం అనౌన్స్

”పుష్ప-ది రైస్” తో తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ఓ స్టార్ హీరో స్థాయి గుర్తింపు ఏర్పరచుకున్నాడు ఫహద్ ఫాసిల్. దీనికి ముందు ఫహద్ తెలుగులో చాలా సినిమాలు చేశాడు. కానీ పుష్పతో వచ్చిన క్రేజ్ ఎక్కువే. ఇటీవల కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించి విక్రమ్ సినిమాలో కీలక పాత్ర చేశాడు.

విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. ఆయన పాత్రకు కూడా అంతే హిట్ అయింది. దీంతో ఫహద్ క్రేజ్ మరింత పెరిగింది. ఆ క్రేజ్ తో ఈ హీరో ఒక పాన్ ఇండియా ఫిలిం లో ఛాన్స్ కొట్టేసాడు. సమంత నటించిన ”యూ టర్న్” సినిమా దర్శకుడైన పవన్ కుమార్ దర్శకత్వం లో ఫహద్ ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.

దీనికి ”ధూమం” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఫహద్ సరసన అపర్ణ బాలామురళి హీరోయిన్ గా నటిస్తున్నారు. కేజీఎఫ్, కాంతార తో పాటు ప్రస్తుతం సలార్ వంటి హై బడ్జెట్ సినిమాలను తెరకెక్కించిన ”హోంబాలే” ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాలో చాల మంది స్టార్ కాస్ట్ అండ్ క్రూ పని చేయబోతున్నట్టు సమాచారం.

- Advertisement -

ఈ సినిమాను తెలుగు, తమిళం, మళయాళం, మరియు కన్నడ భాషల్లో 2023 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు