Chiranjeevi : టాలీవుడ్ పై మెగాస్టార్ సెటైర్లు

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నుండి వస్తున్న తాజా చిత్రం “లాల్ సింగ్ చద్దా”. అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 11న విడుదల అవుతుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్ పనులను ప్రారంభించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్లు, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. వీటితో సినిమాపై అంచనాలు పెరిగాయి. లాల్ సింగ్ చద్దాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో ఈ సినిమా విడుదల కాబోతుంది. కాగ ఆదివారం హైదరాబాద్ లో లాల్ సింగ్ చద్దా టీం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు మెగాస్టార్ చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్య హాజరయ్యారు.

ప్రెస్ మీట్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాశంగా మారాయి. టాలీవుడ్ డైరెక్టర్ లు చేస్తున్న పని వల్ల తాము నటన పై 100 శాతం ఫోకస్ పెట్టలేకపోతున్నామని అన్నారు. బాలీవుడ్ లో అయితే డైలాగ్స్ పై వర్క్ షాప్ నిర్వహిస్తారని, దీనికి మూడు నుండి నాలుగు వారాలు టైం కేటాయిస్తారని అన్నారు.

దీంతో ప్రతి క్యారెక్టర్ కు డైలాగ్స్ ను గుర్తుపెట్టుకోవడం సులవుగా ఉంటుందని వివరించారు. ఇలా చేయడం వల్ల నటులు తమ నటనను 100 శాతం చూపిస్తారని తెలిపారు. కానీ టాలీవుడ్ లో డైరెక్టర్లు సెట్స్ లోనే డైలాగ్స్ రాస్తారని అన్నారు. దీని వల్ల నటులు నటనపై ఫోకస్ పెట్టాలా లేదా డైలాగ్స్ పై ఫోకస్ పెట్టాలా అనే అయోమయంలో ఉంటారని వివరించారు. కాగ టాలీవుడ్ నుండి వచ్చే సినిమాలకే ఎక్కువ డిమాండ్ ఉందని హీరో అమీర్ ఖాన్ అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు