Brahmastra : టాలీవుడ్ పై దృష్టి

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మాస్త్రం. స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, మౌనిరాయ్, నాగార్జున అక్కినేని కీలక పాత్రలలో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో, ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను దక్షిణాదిలో డైరెక్టర్ రాజమౌళి సమర్పిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ తో కలిసి బ్రహ్మాస్త్రం ప్రమోషన్లను ప్రారంభించారు జక్కన్న. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ బ్రహ్మాస్త్ర సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నారు.

సెప్టెంబర్ 2న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సాయంత్రం 6 గంటలకు బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ తో తారక్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఆ క్రేజ్ ను బ్రహ్మస్త్రం కోసం ఉపయోగించుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. కాగా, బాలీవుడ్ లో వచ్చే ఈ సినిమాను టాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు