Bollywood: తన గ్లామర్ షో తో కుర్రకారును ఊపేస్తున్న బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ఎక్కడ తగ్గడం లేదు. దివంగత నటి శ్రీదేవి కూతురి గా బోణి కపూర్ గారాల పట్టీ గా సినిమాల్లోకి చాలా ఈజీ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ తన కంటూ ఓ గుర్తింపు కోసం ఇప్పటికి కష్టపడుతూ ఉంది. 2018 లో ధఢక్ సినిమా తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ మొదటి సినిమా తో పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత “గుంజన్ సక్సేన” బయోగ్రఫీ మూవీ తో నటి గా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు.

అయినా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినందువల్ల అవకాశాలకు కొదవ లేకుండా పోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బల్వాల్, మిస్టర్&మిస్సెస్ మహి సినిమాలు చేస్తుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్ సరసన నటించే సూపర్ ఛాన్స్ దక్కించుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ 30 లో జాన్వి కపూర్ హీరోయిన్ గా కొన్ని రోజుల కిందే సెలెక్ట్ అయింది. నార్త్ లో సక్సెస్ కాలేకపోయినా ఈ హీరోయిన్ సౌత్ లో ఒక్క సినిమా సక్సెస్ అయితే చాలు తొందరగా స్టార్ అయ్యే ఛాన్స్ ఉంది.

తాజాగా జాన్వి కపూర్ బాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ షో కి రెడీ అవుతున్నట్టు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఈ వేడుక కోసం బ్లాక్ డ్రెస్ లో చాలా గ్లామర్ గా రెడీ అయింది. బహుశా ఈ ఫంక్షన్ లో స్టేజ్ పై డాన్స్ షో కూడా చెయ్యొచ్చు హిట్లు లేకపోయినా ఇలాంటి షో లకి వెళ్లడం ద్వారా తన గ్లామర్ తో ఛాన్సులు దక్కించుకుంటుంది ఈ హీరోయిన్. మరి చూడాలి తన గ్లామర్ తో ఇండస్ట్రీ లో ఎన్నాళ్ళు బాలీవుడ్ లో స్థానం నిలబెట్టుకుంటుందో.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు