Bollywood : మరో హీరోయిన్ కు బేబీ గర్ల్

బాలీవుడ్ హీరోయిన్ బిపాస బసు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కెరీర్ ఆరంభం నుంచే మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీని ఏలింది. 2015 నుంచి అనూహ్యంగా సినిమా ఇండస్ట్రికి దూరంగా ఉంటూ వచ్చింది. బిపాస బసు 2016లో కరణ్ సింగ్ గ్రోవర్ ని వివాహం చేసుకున్న తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల ప్రేక్షకులు ఎప్పుడు ఈమెను మరిచిపోలేదు.

ఇదిలా ఉండగా బిపాస బసు తన అభిమానులకు తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. శనివారం ఈమె పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేసింది. అంతేకాకుండా బేబీ బంప్ తో ఇటీవల ఆమె ఒక ఫోటోషూట్ కూడా చేసింది. ఈ ఫోటోషూట్ పై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన, బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకి మద్దతుగా నిలిచారు.

ఈ సీనియర్ హీరోయిన్ ఆడబిడ్డ కి జన్మనిచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వారు చెప్పుకొచ్చారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కూడా గత ఆదివారం పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దాంతో వారం వ్యవధిలోనే ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ డెలివరీ అయ్యారు. ఈ ఇద్దరికి కూడా బేబీ గర్ల్స్ జన్మించడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ లో రణబీర్ కపూర్ నీ ఆలియా వివాహం చేసుకోగా, వారికి ఇదే తొలి సంతానం. మరోవైపు పెళ్లి అయిన ఆరేళ్ల తర్వాత బిపాస బసు మొదటి బిడ్డకి జన్మనిచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు