టాలీవుడ్ లో అనుపమ పరమేశ్వర్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అనుపమ సినిమాల్లోకి రాకముందు మలయాళంలో టీవీషోలు, సెలబ్రెటీ ఛాట్ షోలు, రియాల్టీషోలు చేసింది. సినిమాల్లోకి నటించడం కోసం తన చదువును కూడా వాయిదా వేసుకొంది. ఈమె నటించిన తొలి మలయాల చిత్రం ప్రేమమ్. ముఖ్యంగా ఈమెకు ప్రేమమ్లో మేరీ జార్జ్, తెలుగులో శతమానం భవతి సినిమాలో నిత్య పాత్రలు మంచి పేరునే తీసుకొచ్చాయి.
ఇటీవలే కార్తీకేయ సినిమాతో భారీ హిట్ కొట్టింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ దక్కించుకుంది. కార్తీకేయ సక్సెస్తో అనుపమ పరమేశ్వర్ని అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె నిఖిల్తో నటించిన 18 పేజేస్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అదేవిధంగా బట్టర్ ఫ్లై అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా అనుపమ మరో క్రేజీ ప్రాజెక్ట్లో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా అనుపమను హీరోయిన్గా సెలెక్ట్ చేశారట. ఇక ఈ చిత్రానికి ‘ఈగల్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.