Anaganaga oka raju: ‘జాతి రత్నాలు’ మళ్ళీ కలుస్తున్నారు

Anaganaga oka raju:

పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు అనుదీప్. జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. బాడీ షేమింగ్, పంచ్ డైలాగులతో కామెడీ పండిస్తున్న చాలా మంది ఫిలిం మేకర్స్ కంటే డిఫరెంట్ గా అనుదీప్ తనదైన డీసెంట్ హాస్య శైలితో ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఏమాత్రం అశ్లిలత లేకుండా కామెడీ పండించటం అనుదీప్ ప్రత్యేకత అని చెప్పవచ్చు.

జాతి రత్నాలు సినిమా తరువాత అనుదీప్ తమిళ్ స్టార్ యాక్టర్ శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అనే సినిమాను డైరెక్ట్ చేసాడు. తమిళ్- తెలుగు బై లాంగ్వేజికల్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ప్రిన్స్ సినిమా సక్సెస్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు అనుదీప్. కానీ అవి కొంచెం నిరాశనే మిగిల్చాయి.

ఇకపోతే లాస్ట్ వీక్ రీలిజై ఇప్పుడు థియేటర్స్ లో నవ్వులు పూయిస్తున్న సినిమా “మ్యాడ్”. ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు.జాతి రత్నాలు సినిమాకి రైటింగ్ లో అనుదీప్ కి హెల్ప్ చేసాడు కళ్యాణ్ శంకర్. “మ్యాడ్” కంటే ముందు “అనగనగా ఒక రాజు” అనే సినిమాను సితార బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా అనౌన్స్ చేసారు.

- Advertisement -

కానీ కొన్ని అనివార్య కారణాలు వలన ఆ సినిమా కొంచెం డీలే అయ్యి “మ్యాడ్” పట్టాలెక్కింది. ఇకపోతే కళ్యాణ్ శంకర్ రాసిన “అనగనగా ఒక రాజు” కథను ఇప్పుడు అనుదీప్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
జాతి రత్నాలు సినిమాతో హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ మరో హిట్ సినిమా కొట్టడానికి రెడీ అవుతుందన్నమాట.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు