Ananya Pande: ఓటీటి ఎంట్రీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సన్నజాజి నడుముతో చిట్టి పొట్టి బట్టలతో ఎప్పుడు సోషల్ మీడియాలో హీట్ పెంచుతూనే ఉంటుంది. క్యూట్ లుక్స్ తో కేక పెట్టించే అనన్య పాండే సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తుంది. అద్దానికి అందం అద్దినట్టు ఉండే బ్యూటీ.. నెట్టింట గ్లామర్ షో తో అదరగొడుతోంది.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య. సోషల్ మీడియాలో వయ్యారాలు వడ్డించడంలో.. మిగిలిన హీరోయిన్ల కంటే తక్కువ ఏమీ కాదు ఈ ముద్దుగుమ్మ. అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ.

లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే.. ప్రజెంట్ క్రేజీ హీరోయిన్ గా బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ డిజిటల్ బాటలో వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఆమె ఓ సిరీస్ లో నటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనన్యను వెండితెరకు పరిచయం చేసిన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే ఈ సిరీస్ తెరకెక్కనుంది. దీనికి ” కాల్ మీ బీ” అనే పేరును అనుకుంటున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకువెల్లడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ప్రముఖ ఓటీటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ప్రసారం కానున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు