Pushpa 2 : భీమ్ ని మించి..

స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ” పుష్ప ది రైజ్” మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక ఈ సినిమా రెండవ భాగమైన ” పుష్ప ది రూల్” పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. 

ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పులితో ఫైట్ టేకింగ్ సీన్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు అదే తరహా ఫైట్ సీన్ పుష్ప 2 లో సుకుమార్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. 

ఈ సినిమాలో ఎక్కువ భాగం అడవులలో చిత్రీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మూవీ యూనిట్ ఒక గ్రూప్ థాయిలాండ్ వెళ్లి అక్కడ ఫారెస్ట్ లో పులితో ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారని సమాచారం. మరి ఈ టీంలో అల్లు అర్జున్ ఉన్నాడా? లేదా? అన్నది ఇంకా తెలియ రాలేదు. ఈ పులి సీక్వెన్స్ మూవీకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈనెల చివరి వారం నుంచి పుష్ప సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు