SSMB28 : తెరపైకి లేడి విలన్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 12 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అతడు, ఖలేజా వంటి సినిమాలు ఈ కాంబినేషన్ లో వచ్చాయి. ఇప్పుడు క్రేజీ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి కలిసింది. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న SSMB28 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ రెండు సినిమాలలో మహేష్ బాబుని త్రివిక్రమ్ చాలా భిన్నంగా చూపించారు. దీంతో మూడో సినిమాలో మహేష్ బాబుని ఏ రకంగా చూపిస్తాడు అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా, తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తొలి షెడ్యూల్ లో మహేష్ బాబుపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్టు సమాచారం. రెండో షెడ్యూల్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది.

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలోని ఓ నెగిటివ్ పాత్ర కోసం ఇటీవల “పొన్నియన్ సెల్వన్” చిత్రంలో నటించి మెప్పించిన మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి ని సంప్రదించారట. మహేష్ సినిమా కాబట్టి ఐశ్వర్య లక్ష్మీ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. SSMB28 సినిమాలో మహేష్ బాబు – ఐశ్వర్య ల మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయని సమాచారం. మరి ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు