Mahesh Babu : 34 ఏళ్ల తర్వాత మళ్లీ మహేష్ తో…

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు హ్యట్రిక్ విజయాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సర్కారు వారి పాట సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీత గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, జీ. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.

సర్కారు వారి పాటలో వెన్నెల కిషోర్, సముథ్రకని, సుబ్బరాజు, బ్రహ్మాజీతో పాటు సీనియర్ హీరోయిన్ నదియా కీలక పాత్రలో కనిపించారు. సర్కారు వారి పాట స్టోరీని మలుపు తిప్పే పాత్రలో నదియా నటించింది. కాగ మిర్చి మూవీతో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నదియా, వైవిధ్యభరితమైన, స్టోరీలో మెయిన్ పాత్రలనే ఎంచుకుంటుంది.

కాగ నదియా దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్లీ మహేష్ బాబుతో కలిసి ఈ మూవీలో నటించింది. 1988 లో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్న సమయంలో అన్నయ్య రమేష్ బాబుతో బజారు రౌడీ సినిమా చేశాడు. ఆ సినిమాలో నదియా హీరోయిన్ గా కనిపించింది. ఎ. కొదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో నదియా ద్విపాత్రాభినయం చేసింది.

- Advertisement -

34 ఏళ్ల తర్వాత సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు-నదియా రెండో సారి కలిసి నటించారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే..? ఈ రెండు సినిమాల్లో మహేష్ బాబు పాత్ర పేరు మహేషే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు