Prabhas: ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచో అంటే ?

ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలనే రిలీజ్ చేసిన పాటలు ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. దాదాపు 700 వందల కోట్లతో నిర్మితమైన ఆదిపురుష్ ఇండియాలోనే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సినిమా. మొదట 500 కోట్ల బడ్జెట్ తో అనుకున్న ఈ ప్రాజెక్ట్ విఎఫ్ఎక్స్ కారణంగా ఈ సినిమా బడ్జెట్ పెరుగుతూ వచ్చింది.

శ్రీరాముడిగా ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తుండగా, సీతగా బాలీవుడ్ నటి కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నారు.

- Advertisement -

అయితే గతంలో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని విడదల చేయగా ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది, అలాగే ఇటీవలనే తిరుపతిలో నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఆదిపురుష్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఈ సినిమా యాక్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కి కూడా ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా.. అనే ఎదురు చూపులు మొదలయ్యాయి. కాగా మొన్నటిదాకా ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తారో మూవీ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ప్రేక్షకులు ఆదిపురుష్  సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ప్రకటించాలంటూ డిమాండ్ చేయడంతో, నిన్న సాయంత్రం ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ రేపు అంటే (11/6/23) ఆదివారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా  అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్టు ఆదిపురుష్ సినిమా మూవీ టీం ప్రకటించింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు