ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న విడుదలై మిశ్రమ స్పందన అందుకున్న విషయం తెలిసిందే. టి – సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించగా.. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, హనుమంతుడి పాత్రలో దేవదత్త నాగే నటించారు.
అయితే ఈ సినిమాపై అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రభాస్ లుక్స్ పై కేర్ తీసుకోలేదని దర్శకుడు పై ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాకుండా ఆది పురుష్ ప్రీ రిలీజ్ వేడుకలలో దర్శకుడు ఓం రౌత్ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. రామాయణం ప్రదర్శించే ప్రతి చోటకు హనుమంతుడు వస్తాడని తన అమ్మ చెప్పారని.. అందువల్ల ఆది పురుష్ సినిమా ఆడుతున్న ప్రతి థియేటర్ లో ఒక సీటు ఖాళీగా ఉంచాలని ఆయన నిర్మాతలను విజ్ఞప్తి చేశారు. దీనికి నిర్మాతలు కూడా ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇలా చేయడంతో ఓం రౌత్ హనుమంతుడికి గొప్ప భక్తుడని అందరూ భావించారు.
కానీ ఇదే సమయంలో గతంలో హనుమంతుడి గురించి ఓంరౌత్ చేసిన ట్వీట్ ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ” హనుమంతుడు చెవిటివాడా..? మా బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న జనాలు ఇలాగే అనుకుంటున్నారు. అందుకే హనుమాన్ జయంతి రోజున లౌడ్ స్పీకర్ లతో మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. అదే కాకుండా సంబంధం లేని సాంగ్స్ వేస్తున్నారు” అంటూ 2015లో హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ని ఇప్పుడు బయటకు తీసిన నెటిజెన్లు అతని విమర్శిస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో ఓం ఆ ట్వీట్ ని తొలగించినప్పటికీ.. దానిని స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేస్తున్నారు. అతనికి రాముడిపై కానీ, హనుమంతుడిపై కానీ భక్తి లేదని.. కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే రామాయణాన్ని ఉపయోగించుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాడికి రామాయణం గొప్పతనం గురించి ఏం తెలుస్తుందని మండిపడుతున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News