Anasuya: ఎమోషనల్ ట్వీట్ – అటెన్షన్ కోసమేనా..!

జబర్దస్త్ యాంకర్ అనసూయ తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఆ మధ్య విజయ్ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన అనసూయ ఆ తర్వాత తనకి విజయ్ పట్ల ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లాంటిది లేదని స్టేట్మెంట్ ఇచ్చి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. తాజాగా మరో ఎమోషనల్ ట్వీట్ చేసింది అనసూయ. తన పేరుని వాడుతూ ఇంకొకరిని టార్గెట్ చేయటం ద్వారా సదరు వ్యక్తితో పాటు తనని కూడా కించపరిచినట్లు అవుతుందని, తనకూ ఒక కుటుంబం ఉందని తన జీవితం తన లైఫ్ తాను గడుపుతున్నానని ఇకనైనా తనని వదిలేయండంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. తానంటే పడని వారు తనని ఫాలో అవ్వటం మానేసి తన పోస్ట్ లకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది అనసూయ.

ఈ క్రమంలో అనసూయ అటెన్షన్ కోసమే ఈ ట్వీట్ చేసిందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తరచూ ఎదో ఒక ట్వీట్ చేసి 3, 4రోజులపాటు లైమ్ లైట్ లో ఉండాలని ప్రయత్నించటం అనసూయకి అలవాటయ్యిందంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి పోస్ట్ చేసిన బికినీ ఫోటోలపై తీవ్ర విమర్శలు రాగా, వాటి నుండి డైవర్ట్ చేసేందుకే ఈ ట్వీట్స్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే, తన పేరుని వాడుకొని రాజకీయంగా కొంతమందిని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చిన అనసూయ సదరు వ్యక్తుల పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంటే బాగుండేదన్నది కొంతమంది నెటిజన్ల వాదన. మరో పక్క విజయ్ దేవరకొండకి సన్నిహితుడైన ఒక వ్యక్తి డబ్బులు పెట్టి మరి తనపై ట్రోల్స్ చేయిస్తున్నాడంటూ అనసూయ ఇటీవల చేసిన వ్యాఖ్యల కారణంగా తనపై దాడి ఎక్కువైందని కూడా అంటున్నారు. మరి, అనసూయ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ తో అయినా తనపై ట్రోల్స్ ఆగుతాయో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు