గత కొంతకాలంగా అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ రెండో పెళ్లి వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కి చెందిన చరణ్ రెడ్డిని సుప్రియ ప్రేమ వివాహం చేసుకుంది. అయితే కొన్ని మనస్పర్ధల కారణంగా కొంతకాలానికే వీళ్లు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అనూహ్యంగా 2012 మార్చి 19న చరణ్ రెడ్డి మరణించారు.
అయితే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుప్రియ.. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని గూడచారి అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సమయంలో సుప్రియ అడవిశేష్ ని ప్రేమించిందని, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ గత కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ కొన్నిసార్లు మీడియా కంట పడడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరినట్లైంది. వీరిద్దరూ ఒకే కారులో పక్కపక్కన కూర్చుని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ వైరల్ గా మారింది. అయితే సుప్రియ, అడవి శేష్ కంటే ముందే మరో టాలీవుడ్ హీరోని ప్రేమించిందని, ఆ హీరోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుందని ఇప్పుడు మరో న్యూస్ వైరల్ గా మారింది.
అయితే ఆ హీరో బడా ఫ్యామిలీ మెంబర్ కావడంతో తనని రెండో పెళ్లి చేసుకుంటాడా..? అనే అనుమానంతో ఆమె ప్రేమ విషయాన్ని అమెలోనే దాచేసుకుందట. ఆ హీరోని దూరం నుంచి చూసి ప్రేమిస్తూ కాలం గడిపేసిందట. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ హీరోతో వర్క్ చేసే అవకాశం వచ్చినా ఈ అమ్మడు రిజెక్ట్ చేసిందట. ఆ హీరో కి పెళ్లి జరిగేంతవరకు ఎంతో ఉత్సాహంగా ఆయన ప్రతి ఈవెంట్ లో పాల్గొన్న సుప్రియ.. ఆ హీరో కి పెళ్లి కాగానే అతడికి దూరంగా ఉంటుందట. ఆ తరువాతే సుప్రియ అడవి శేష్ కి దగ్గర అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News