PRABHAS: నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్లు చేస్తున్న ఆదిపురుష్ టీమ్

ఆదిపురుష్ టీమ్ ఫుల్ జోష్ లో ఉంది. మూవీ రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమ ప్రమోషన్లతో సినిమాపై ఉన్న అంచనాలని తారా స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. దానికి చిత్ర యూనిట్ మొత్తం ఎవరికీ వారు వారి పద్ధతుల్లో ప్రమోట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు కి సంబంధించిన ప్రమోషన్స్ తో పాటు సౌత్ ఇండియా మొత్తం టూర్ వేయనున్నారు. అటు బాలీవుడ్ లో చిత్ర నిర్మాత, డైరెక్టర్ తో పాటు ఇతర నటీనటులతో ప్రముఖులను కలుస్తూ వారిచేత కూడా ప్రమోట్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఇంకా పాటలు సినిమాపై ఉన్న అంచనాలని ఓ రేంజ్ లో పెంచేసాయి. ఇక సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే ఆంజనేయుడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. ఇక ఈ సినిమాకు అజయ్ అతుల్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో భారీ స్థాయిలో 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

తాజాగా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతి లో జూన్6న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇక ఆ ఈవెంట్ లో ముంబాయి నుంచి 200 మంది డ్యాన్సర్లు, 200 మంది సింగర్లు రానున్నారు. అంతేకాకుండా “జై శ్రీరామ్” అనే శబ్దం వచ్చే బాణా సంచాలను తీసుకొస్తున్నారని టాక్. ఓవరాల్ గా తిరుపతి లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.

- Advertisement -

ఇక తాజాగా ఆదిపురుష్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ ఈ సినిమాలో ఆంజనేయుడిగా నటించిన దేవదత్త తో కలిసి ప్రమోషన్ లో భాగంగా అస్సాం ముఖ్యమంత్రి “హిమంత బిస్వా శర్మ” ని కలవడం జరిగింది. ఆయనకు ఆదిపురుష్ యొక్క ట్రైలర్, పాటలను చూపించి సినిమాను ప్రమోట్ చేయమంటూ, సీతారాముల విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక ఆదిపురుష్ సినిమాను జూన్16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు