బాలీవుడ్ క్యూట్ కపుల్ ఎవరని చెప్పకుగా ఠక్కున రణవీర్సింగ్-దీపికా పదుకొనె పేరు చెబుతుంటారు. ఇలా క్యూట్ కపుల్గా చెప్పుకునే ఈ దంపతుల బంధం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగులుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా వీరిద్ధరి మధ్య భేదాబిప్రాయాలు ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని కూడా టాక్ వినిపిస్తోంది.
రణ్వీర్సింగ్, దీపికా పదుకొనే దంపతులు కొన్నేళ్లపాటు ప్రేమించుకుని 2018లో వీరు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఎక్కడ చూసినా.. ఈవెంట్ అవార్డు ఫంక్షన్లలో ఇద్దరు జంటగా, అన్యోన్యంగా కనిపించేవారు. కొన్ని వాణిజ్య ప్రకటనలు ఇద్దరూ కలిసి చేసేవారంట. ఆ ఇద్దరి మధ్య బంధం ఎంత ప్రాచుర్యం పొందింతే మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే వీరి మధ్య మనస్పార్థాలు తలెత్తాయని బీటౌన్ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఉత్తరాదికి చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధూ వీరి మధ్య బాగాలేదని ఓ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
త్వరలోనే వీరు విడాకులు తీసుకుంటారని ఉమైర్ సంధూ ట్వీట్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో రణ్వీర్సింగ్ తమ బంధంపై వివరణ కూడా ఇచ్చాడు. పదేళ్ల కాలంలో అనగా 2012లో దీపికాతో పరిచయమైనప్పటి నుంచి ప్రేమ ఇంకా పెరిగిందంటున్నాడు. దీపికా తన జీవితంలో వచ్చిన తరువాత మరింత ఆనందంగా మారిందని చెప్పుకొచ్చాడు. మరోవైపు తాజాగా దీపికా పదుకొనె తన తల్లి ఉజ్జలతో ఎయిర్ ఫోర్ట్లో కనిపించినప్పుడు ఆమె చేతిలో వెడ్డింగ్ రింగ్ కనిపించలేదు. ఇది చూసిన నెటిజన్లు విడాకుల వార్త వాస్తవమేనని నమ్ముతున్నారు. రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ అని తెలుస్తోంది. ముందు ముందు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.