Manamey : సింగర్ గా మారబోతున్న శర్వా

Manamey : టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం శర్వానంద్ లైనప్ లో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా థియేటర్లలోకి రాబోతోంది “మనమే” (Manamey). తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఆ పాటకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం యాక్టర్ గా అదరగొడుతున్న శర్వానంద్ ఇప్పుడు తనలోని కొత్త టాలెంట్ ను బయట పెట్టబోతున్నారు. సింగర్ గా మారి మల్టీ టాలెంటెడ్ అనిపించుకోవడానికి రెడీ అవుతున్నారు. మరి ఇంతకీ శర్వానంద్ పాడిన ఆ పాట ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

ఈ పాట శర్వా నోట…

శర్వానంద్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మాలీవుడ్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ రిలీజ్ కాగా, అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను కథకు తగ్గట్టుగా లండన్, హైదరాబాద్ లో షూట్ చేశారు. త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారు. అందులో భాగంగానే మార్చ్ 28న “మనమే మూవీ నుంచి “ఇక నా మాటే” అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఈ పాటనే శర్వానంద్ పాడినట్టుగా ప్రచారం జరుగుతుంది. దీంతో మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సాంగ్ రిలీజ్ గురించి సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ సింగిల్ పై శర్వా అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. మరి ఈ యంగ్ హీరో తన వాయిస్ తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడు అనేది మార్చ్ 28న రిలీజ్ కాబోతున్న ఈ సాంగ్ విన్నాకే అర్థమవుతుంది.

ఇప్పటిదాకా సింగర్ గా మారిన టాలీవుడ్ స్టార్స్…

టాలీవుడ్ లో సింగర్ గా మారిన స్టార్ కేవలం శర్వానంద్ మాత్రమే కాదు. ఇదివరకు చాలామంది హీరోలు ఇలా తమలోని మల్టీ టాలెంట్ ను బయట పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అక్కినేని అఖిల్, నందమూరి బాలకృష్ణ వంటి హీరోలు తమ సినిమాల కోసం స్వయంగా వాళ్ళే సింగర్స్ గా మారి ఆకట్టుకున్నారు. ఇప్పుడు శర్వానంద్ కూడా ఇదే ప్రయత్నం చేయబోతున్నారు.

- Advertisement -

మరో రెండు సినిమాలు లైన్లో…

శర్వానంద్ ఖాతాలో మనమే మూవీతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా శర్వానంద్ 36వ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. అభిలాష్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, తన 37వ సినిమాను కూడా అప్పుడే లైన్ లో పెట్టేసాడు శర్వానంద్. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వా 37వ మూవీ రూపొందనుంది. ఇదొక అద్భుతమైన ఫన్ రైడ్ మూవీ గా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు