Rashmika Mandanna: భారీగా రేటు పెంచిన రష్మిక ?

Rashmika Mandanna

రష్మిక గురించి తెలియని వారు ఉండరు. కన్నడ భామ రష్మిక మందన ఇండియన్ క్రష్ గా మారిపోయింది. ఆమె నటించిన పుష్పాకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కడంతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. దాంతో హిందీ సినిమా ఆఫర్లు వెళ్ళువెత్తడంతో ప్రస్తుతం దక్షిణాది వైపు చూపు చూసే సమయమే లేకపోయిందని వార్తలు వినపడుతున్నాయి.

కన్నడ సిని పరిశ్రమలో కిరిక్ పార్టీ సూపర్ హిట్ కావడంతో తొలి సినిమాతోనే రష్మిక అదృష్టం తలుపు తట్టింది. ఆ తర్వాత కన్నడలో మంచి ఆఫర్లు రావడంతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. కన్నడలో భారీ అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఆ తరుణంలోనే సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ సినిమాతో రాబోతోంది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. డిసెంబరు 1వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికీ చిత్రబృందం షూటింగ్ శరవేగంగా జరుపుతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా…తాజాగా ఈ సినిమాలో ఉన్న నటీనటుల పారితోషకం మరింత హాట్ టాపిక్ గా మారింది. రణబీర్ ఈ చిత్రంలో నటించడానికి రూ. 70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. అలాగే రష్మిక మందన రూ. 5 నుంచి 4 కోట్లు తీసుకుందని తెలుస్తోంది. అంటే ఈ లెక్కన యానిమల్ సినిమా ముందు కంటే ఇప్పుడు రేటు బాగా పెంచిందట రష్మిక. మొన్నటి వరకు మూడు కోట్ల వరకు తీసుకునేదట. ఇప్పుడు ఐదు కోట్లకు పెంచేసిందట రష్మిక.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు