నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ల వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే. ఇటీవలే సీతారామం చిత్రంలో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పుష్ప 2 చిత్రం షూటింగ్లో పాల్గొననుంది. గత కొద్ది రోజుల కిందట రష్మిక జ్యోతిష్కుడు వేణు స్వామితో పూజలు చేయించిన విషయం తెలిసిందే.
ఇక జాతకాన్ని బట్టి ముందు ముందు ఎలా ఉండబోతుందో కూడా చెప్పాడు వేణుస్వామి. ముఖ్యంగా రష్మిక-రక్షిత్శెట్టితో విడిపోయిన తరువాత ఆమె జీవితం బాగుంటుందని ముందే చెప్పినట్టు తెలిపారు. ఇక రక్షిత్శెట్టితో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకున్నాకా ఈమె స్టార్ హీరోయిన్ కాదు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఆమె రానున్న రోజుల్లో రాజకీయాల్లో చేరే అవకాశం ఉందట.
అంతేకాదు.. ఆమె లోక్సభ ఎంపీగా గెలవనుందని వేణుస్వామి చెప్పాడు. కన్నడ హీరోయిన్ రమ్య లాగానే అటు ఎంపీగా, ఇటు నటిగా కొనసాగనున్నదని వేణుస్వామి వెల్లడించాడు. సమంత-నాగచైతన్య విడిపోతారని, లైగర్ సినిమా ఫ్లాప్ అవుతుందని వేణుస్వామి చెప్పినట్టే జరిగాయి. రష్మిక విషయంలో ఈ జ్యోతిష్యుడు చెప్పినట్టు జరుగుతుందో లేదో వేచి చూడాలి.