Rana: అవయవదాత కావాలంటున్న రానా.. ఆందోళనలో ఫ్యాన్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కెరియర్ మొదలుపెట్టి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన రానా ఆ తర్వాత పలు సినిమాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు.. హీరో రానా కెరియర్ లో మర్చిపోలేని సినిమా ఏదంటే బాహుబలి, లీడర్ సినిమాలని చెప్పవచ్చు.. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈయన తెలుగులో చివరిగా రామానాయుడు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో రానా పేరు వైరల్ గా మారుతోంది.. అందుకు కారణమేంటో చూద్దాం.

గుర్గావ్ లో జరిగిన సినాప్స్ వేడుకలలో భాగంగా రానా పాల్గొని..అక్కడ తాము ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి కూడా తెలియజేశారు.. తన ఆరోగ్యం గురించి ఎవరైనా అడగాలి అనుకుంటే.. కన్ను, కిడ్నీ దానం చేసే ఆలోచనలు ఉంటే మాత్రమే అడగండి అంటూ తెలిపారు.. లేదంటే అడిగే అవసరం లేదని కూడా చెప్పేశారు.. మనిషి చివరి దశలో ఉన్నప్పుడు జీవితంలో చాలా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారని.. ఆ క్షణం ఆలోచన ఎన్నో విధానాలను మారుస్తుందని అందుకు తాను మినహాయింపు కాదని కూడా వెల్లడించారు రానా.

ఆసుపత్రికి వెళ్లిన సమయంలో అక్కడ తనకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తెలిశాయని.. ఆ సమయంలో తనను తాను భిన్నంగా చూసుకున్నానని.. సమస్యలు ఎదురైనప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తాయి అని.. అన్నీ ఒకేలా ఉండవని గ్రహించాలని తెలిపారు.. అప్పటివరకు నన్ను ముందుకు నడిపిస్తాయి అనుకున్నవన్నీ మధ్యలోనే వదిలేశాయని రానా తెలియజేశారు.. బాహుబలి సినిమా కోసం తాను బరువు పెరిగి అనారోగ్యం వల్ల తగ్గిపోయానని తెలిపారు.

- Advertisement -

ఆ సమయంలో చాలామంది తనని ఆరోగ్యంగానే ఉన్నావా అంటూ ప్రశ్నించే వారని.. వారందరికీ తాను సమాధానం చెప్పాలనుకోవడం లేదని.. వీటి నుంచి కోలుకున్న తర్వాతే అరణ్య సినిమా షూటింగ్లో పాల్గొనడం తనకి ఆనందంగా అనిపించిందంట తెలిపారు రానా.. ఏనుగులతో కలిసి నటించాను ఆరోగ్యం బాగా లేకున్నా అక్కడ తనను పట్టించుకునే వారు ఎవరూ లేరని కూడా తెలిపారు.. అయితే అక్కడ ఉన్న నిశ్శబ్ద వాతావరణమే తనకు చాలా ఉపయోగపడిందని ప్రకృతిని మించిన వైద్యం లేదని అర్థమయ్యిందంటూ చెప్పుకొచ్చారు రానా.. అయితే ఈ సందర్భంగా రానా చేసిన వ్యాఖ్యలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రస్తుతం రానా సినిమాల విషయానికి వస్తే.. హిరణ్య కశ్యప .. రాక్షస రాజా అనే సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు.. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విరాటపర్వం సినిమాలో నటించి డిజాస్టర్ ను మూట కట్టుకున్న రానా ఇప్పుడు ఈ సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఇకపోతే విరాటపర్వం సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటించిన విషయం తెలిసిందే అయినా కూడా సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇకపోతే తాజాగా ఎవరైనా తనకు అవయవదానం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా పరోక్షంగా కామెంట్లు చేశారు రానా ఈ విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు