TilluSquare : టిల్లుగానికోసం క్రేజీ ఆఫర్ ఇచ్చిన హనుమాన్ నిర్మాత?

టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ కాగా యూట్యూబ్ లో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. 2022 లో రిలీజ్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కగా ఇక ఫస్ట్ పార్ట్ తెరకెక్కించిన నాగ వంశియే ఈ సీక్వెల్ సినిమాను కూడా నిర్మించాడని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో టిల్లు స్క్వేర్ ని మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ రెండు సినిమాలకు కథ అందించింది సిద్ధూయే కావడం విశేషం. ఇక ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

ఇక సోషల్ మీడియా లో ట్రైలర్ రెస్పాన్స్ కి టాలీవుడ్ లో భారీ రేటు చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీ అయ్యారు. ట్రైలర్ ని చూస్తే మొదటి పార్ట్ ని మించి ట్రైలర్లో డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారని మాత్రం తెలుస్తుంది. అందుకే చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఈ కమర్షియల్ సినిమా కోసం బయ్యర్లు ఎగబడుతున్నారు.

ఇదిలా ఉండగా రీసెంట్ గా హనుమాన్ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి కోట్ల లాభాలు వెనకేసుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి టిల్లు స్క్వేర్ థియేటర్ రైట్స్ కు 28 కోట్ల క్రేజీ ఆఫర్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనే నిజాం రైట్స్ కి ట్రై చేసి దక్కించుకోలేకపోయిన ఈ నిర్మాత ఇప్పుడు నైజాం రైట్స్ అయినా దక్కించుకోవాలని చూస్తున్నాడని టాక్. గతంలో నైజాం రేటు 7 కోట్లు కోట్ చేయగా, టిల్లు స్క్వేర్ ఇప్పుడు నైజాం మాత్రమే 10 కోట్లకి పైగా వుంటుందని టాక్ నడుస్తుంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు గాని టిల్లు స్క్వేర్ కోసం మాత్రం బయ్యర్లు అన్ని ఏరియాల్లో కాచుకుని కూర్చున్నారు. మరి నాగవంశీ ఈ డీల్స్ ని ఎలా ఫినిష్ చేస్తారో చూడాలి.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు