Naga Chaitanya: తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నో చెప్పాడు

అక్కినేని వారసుడిగా వాసు వర్మ దర్శకత్వం వహించిన జోష్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. కానీ వాస్తవానికి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. వాసు వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా కూడా ఇప్పటికీ చాలామందికి ఒక ఫేవరెట్ ఫిలిమ్ గా ఉంటుంది. ఈ సినిమాలో నాగచైతన్యని చూపించిన విధానం. ఈ సినిమాలోని డైలాగ్స్. అందర్నీ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య ఆటిట్యూడ్ కూడా చాలామందికి ఇష్టం అని చెప్పొచ్చు. కానీ అప్పుడున్న కొన్ని కారణాల వలన ఈ సినిమా అంతగా ఆడలేదు.

జోష్ సినిమా తర్వాత నాగచైతన్య చేసిన సినిమా ఏ మాయ చేసావే. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అయింది. కేవలం కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాకుండా చాలామంది ప్రశంసలను కూడా అందుకుంది ఈ చిత్రం. ఇప్పటికీ ఈ సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ కూడా తనకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఏమాయ చేసావే కూడా ఒకటి అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాతోనే సమంతకి, నాగచైతన్యకి మధ్య పరిచయం మొదలై అది ప్రేమ వరకు దారితీసి తర్వాత ఇద్దరు ఒకటై కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవడం కూడా జరిగింది. ఇకపోతే సమంత నాగచైతన్య కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. ఇకపోతే నాగచైతన్య సమంత ఇద్దరు కలిసి పెళ్లి తర్వాత చేసిన సినిమా మజిలీ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు.

- Advertisement -

నిన్ను కోరి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శివ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. నాని చేసిన సినిమాల్లో ఇది కూడా ఒక బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలామందికి పర్సనల్ గా కూడా కనెక్ట్ అయింది. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న తర్వాత నాగచైతన్యతో మజిలీ సినిమాను తెరకెక్కించాడు శివ. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత శివ తీసిన టక్ జగదీష్ సినిమా ఓటిటి రిలీజ్ అయ్యి ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇక సమంత, విజయ్ దేవరకొండ జంటగా ఖుషి అనే సినిమాను తెరకెక్కించాడు శివ. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇకపోతే శివ ప్రస్తుతం నాగచైతన్యకు ఒక కథను వినిపించినట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ కథ నాగచైతన్యకు నచ్చకపోవడం వలన ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇకపోతే ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాను చేస్తున్నాడు. సముద్ర నేపథ్యంలో ఈ సినిమా జరుగుతుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. కార్తికేయ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు